

అయితే అచ్చమైన తెలుగు కథలతో చాలా కొద్దిపాటి సినిమాలే వస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఓ అచ్చమైన తెలుగు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30న మరో తెలుగు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ‘బిర్యాని కోసం ఆ సినిమానే – కరిముల్లా బిర్యాని పాయింట్ నూతక్కి’ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ చిత్రంలో, ఓల్డ్ ఏజ్లో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ బిర్యాని కొనేందుకు పడే కష్టాలపై కథ నడుస్తుంది.
కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు ప్రభు చంద్ కథ, దర్శకత్వం వహించగా, చైతన్య సగిరాజు, కంచెరపాలెం రాజు, శివ నారాయణ నరిపెద్ది (అమృతం ఫేమ్ అప్పాజి) ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా నటించారు. వీరితో పాటు కేదార్, సుజన జొన్నాల హీరో–హీరోయిన్లుగా నటిస్తూ, వారి మధ్య లవ్ రొమాంటిక్ ట్రాక్, మరొక వైపు ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్తో కామెడీని చూపించారు. మరి ముగ్గురు ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్ ఫన్ చూడాలనుకుంటే ఈటీవీ విన్ ఓటీటీలో కరిముల్లా బిర్యాని పాయింట్ మూవీని వీక్షించొచ్చు.




















కామెంట్స్ (2)
Will check it out on ETV Win.
ఈటీవీ విన్లో తప్పక చూడాల్సిన మూవీ!