
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13 న థియేటర్లలో విడుదలైంది. వాలెంటైన్ వీక్ స్పెషల్గా వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా, నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను ఎస్.నాగవంశీ మరియు సాయిసౌజన్య నిర్మించారు.
ఈ సినిమా త్వరలో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 13 నుంచి ఇది అందుబాటులోకి రానుందని నెట్ఫ్లిక్స్ తన అప్కమింగ్ సినిమాల జాబితాలో ప్రకటించింది. మొదటగా ఇది తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’ తో పెద్ద విజయం సాధించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం.
ఈ సినిమాలో కోమల్ (విశ్వక్ సేన్) అనే కొత్త దర్శకుడి కథ చూపించారు. అతనికి ‘మంచి ప్రొడక్షన్స్’ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమా తీసే అవకాశం వస్తుంది. రూ.4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్ (నరేష్) చెప్పినా, చివరికి ఖర్చు రూ.40 కోట్లకు చేరుతుంది. అయినా సినిమా పూర్తికాకపోవడంతో నిర్మాత తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. తర్వాత ఆయన కూతురు చిత్ర (కయాదు లోహర్) నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుంది. కోమల్ మిగిలిన సినిమాను పూర్తి చేశాడా? అతను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా? చిత్రతో అతని ప్రేమ ఎలా మొదలైంది? జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!