

ఓటీటీ వేదికల్లో మలయాళ సినిమాలకు రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘సర్వం మాయ’ సినిమా మంచి స్పందన అందుకోవడంతో, కొత్త మలయాళ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన మలయాళ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
నివిన్ పౌలీ హీరోగా నటించిన ‘బేబీ గర్ల్’ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 12 నుంచి ఈ సినిమా సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి మాయమవడం చుట్టూ తిరిగే కథతో రూపొందింది. ఈ మూవీలో లిజోమోల్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!