
సినిమాలు

శివాత్మిక రాజశేఖర్ మరియు కిషన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఆరోమలే’, నవంబర్ 7, 2025 న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సారంగ్ తియాగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో సాధారణ స్పందన పొందినా, ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 12, 2025 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేకంగా, ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో – తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీలో విడుదల చేయనున్నారని నిర్మాతలు ప్రకటించారు.
ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, ఓటీటీ రిలీజ్తో ప్రేక్షకుల్లో మరోసారి గుర్తింపు పొందుతుందనే ఆశతో చిత్రబృందం ఉంది. ఈ సినిమాకు సంగీతం సిద్ధు కుమార్ అందించగా, నిర్మాణ బాధ్యతలు మినీ స్టూడియో ఎల్ఎల్పీ నిర్వహించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!