
న్యూస్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్లైన్ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ బుధవారం సాయంత్రం ముగిసింది. మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. మూడో రోజు ఒక్క రోజే 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
మొత్తం 1,80,000 టోకెన్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 వ తేదీల్లో లక్కీ డిప్ టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.
టోకెన్ లేని భక్తులు ఈ మూడు రోజుల్లో సాధారణ దర్శనం కూడా పొందలేరు. ఎంపిక కాని వారు జనవరి 2 నుంచి 8 వరకు సాధారణ స్లాట్ బుకింగ్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!