

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముద్రించిన పంచాంగంలో తీవ్రమైన తప్పులు చోటుచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. వేద పండితులు, అర్చకులు ప్రామాణికంగా తీసుకునే ఈ పుస్తకంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల వివరాల్లో తేడాలు బయటపడ్డాయి. ఇప్పటికే విడుదల చేసిన ఆహ్వాన పత్రికల ప్రకారం మార్చి 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం, ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణం, 2న రథోత్సవం, 4న చక్రస్నానం, 5న పుష్పయాగం జరగాల్సి ఉంది.
అయితే తితిదే పంచాంగంలో మాత్రం మార్చి 31న కల్యాణం, మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉత్సవాలు జరుగుతాయని ముద్రించడం గందరగోళానికి దారితీసింది. పగటి, రాత్రి వాహన సేవలు సహా అనేక కార్యక్రమాలు తప్పుగా పొందుపరిచినట్లు వెల్లడైంది. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానాలు అందజేయగా, ప్రజల్లోనూ ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్ర అధికారిక గుర్తింపు పొందిన క్షేత్రానికి సంబంధించిన వివరాల్లో ఇలాంటి పొరపాట్లు చోటుచేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!