
సినిమాలు

ఏపీ – తెలంగాణ మధ్య జల వివాదానికి సంబంధించిన కేసును నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం – నల్లమల సాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వరద నీటిని తరలిస్తున్నామని చెప్పి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.
ఈ పిటిషన్ను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో స్పెషల్ సూట్ దాఖలు చేయాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!