

భోజన ప్రియులకు రుచికరమైన వంటకాలతో పేరు తెచ్చుకున్న శుద్ధ విలాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను కొనసాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్, ట్రెడిషన్ సర్వ్డ్ ఇన్ స్టైల్ అనే మోటోతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మల్కాజ్గిరి మరియు మలేషియాలో కూడా ఈ బ్రాండ్కు మంచి ఆదరణ లభించింది.
ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో తన అడుగులను బలంగా వేస్తూ దుబాయ్లో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. అక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తమ స్వదేశ రుచులను అందించాలనే ఉద్దేశంతో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 20 న దుబాయ్లో ఈ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు.
దుబాయ్లోని డిస్కవరీ గార్డెన్స్, జెబెల్ అలీ విలేజ్, స్ట్రీట్ నంబర్ 1, బిల్డింగ్ నంబర్ 12 వద్ద ఈ కొత్త శాఖ ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో జరిగింది. శుద్ధ విలాస్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్ కాగా, దుబాయ్ బ్రాంచ్లో ప్రవీణ్, శ్రీనివాస్, వెంకట్ మార్తాండ్, సాగర్, హుస్సేన్ భాగస్వాములుగా ఉన్నారు. దుబాయ్ ప్రారంభంతో మిడిల్ ఈస్ట్లో విస్తరణకు ఇది ప్రారంభంగా మారింది.
త్వరలో షార్జా, అబుదాబి, ఖతార్ వంటి ప్రాంతాల్లో కూడా కొత్త శాఖలను ప్రారంభించే యోచనలో సంస్థ ఉంది. అదే సమయంలో హైదరాబాద్లోని అల్కాపురి టౌన్షిప్లో కూడా ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అదనంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా శాఖల ప్రారంభంపై చర్చలు జరుగుతున్నాయి.
భవిష్యత్తులో అంతర్జాతీయ విస్తరణలో భాగంగా అమెరికాలో కూడా రెస్టారెంట్ ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయని సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. ఆసియా, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ‘శుద్ధ విలాస్’ బ్రాండ్ను విస్తరించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!