
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలు శుక్రవారం బస్ భవన్లో ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం కార్మిక కమిషనర్ కార్యాలయంలో కూడా అధికారికంగా సమ్మె నోటీసు సమర్పించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం తప్పదని నేతలు హెచ్చరించారు.
సమ్మె తేదీపై పద్నాలుగు రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణను ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా మూడు వందల యాభై కోట్ల రూపాయలను కోత లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!