
సినిమాలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఏ. జి. పేరరివాళన్ తాజాగా న్యాయవాదిగా మారారు. ఆయన ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయనను 2022 లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశారు.
విడుదల అనంతరం పేరరివాళన్ బెంగళూరులోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. డిగ్రీ సాధించిన తర్వాత 2025 లో ఆల్ ఇండియా బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. త్వరలో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. న్యాయ సహాయం అందని ఖైదీలకు గొంతుకగా మారడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!