

తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదని తమకు తెలియదని, తనూజ పుట్టినరోజు సందర్భంగా ఎగ్ లేని కేక్ మాత్రమే తీసుకువచ్చామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, స్వామివారి సన్నిధిలో ఎలాంటి అపచారం చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
తనపై చర్యల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అసలు విషయాన్ని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎగ్ లేని కేక్ కట్ చేసినందులో తన తప్పు ఏముందని ప్రశ్నించిన ఆయన, కేసులకు భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఈ విషయాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పారు. తాము తప్పు చేసి ఉంటే స్వామివారి శిక్షను స్వీకరించేందుకు సిద్ధమని కూడా అన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!