

తమిళనాడు పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ఎన్డీఏతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కలిసి చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, సంక్షేమం వంటి అంశాలు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసి, తమిళ ప్రజలు ప్రగతిశీల ఆలోచనలతో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
డీఎంకే, కాంగ్రెస్ వంటి పార్టీలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, కీలక బిల్లులపై వారి వ్యతిరేకత మహిళలకు మరియు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించిందన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలపై వారి వైఖరిని ప్రశ్నిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను విస్మరించడం సరైంది కాదన్నారు. నదుల అనుసంధానం వంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర మద్దతుతోనే సాధ్యమని పేర్కొన్నారు. దక్షిణాది ప్రయోజనాల కోసం తాను ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!