
రాజకీయాలు

ఇరాన్ పరిస్థితులు మరియు రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో నెలకొన్న పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సమస్యలకు స్థిరమైన పరిష్కారం యుద్ధరంగంలో కాదని పేర్కొన్నారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచ దేశాలు సంభాషణ, దౌత్య మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతియుత చర్చలు అత్యవసరమని తెలిపారు. భారత్ ఎప్పటినుంచో శాంతి, సంభాషణ, దౌత్యానికి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసిన ప్రధాని, యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మానవ నష్టం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!