

నారా లోకేష్ తన X ఖాతాలో శ్రీ సిటీ ఎల్ జి ప్లాంట్ గురించి పోస్ట్ చేశారు. శ్రీ సిటీలో నిర్మాణంలో ఉన్న LG Electronics ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం వేగంగా ముందుకు సాగుతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. గతేడాది మేలో భూమి అధికారికంగా అప్పగించిన అనంతరం, రూ.5,000 కోట్ల పెట్టుబడితో 247 ఎకరాల్లో ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఎల్ జి కు భారత్లో మూడో తయారీ యూనిట్గా నిలవనుండగా, ఇక్కడ ఫ్రిజ్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు మరియు కీలక ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తి జరగనుందని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం చివరినాటికి ఉత్పత్తి ప్రారంభమై, 2029 వరకు దశలవారీగా విస్తరణ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడిదారులకు అనుకూల రాష్ట్రంగా మరింత బలోపేతం చేస్తుందని నారా లోకేష్ తన పోస్టులో స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!