
.jpg&w=3840&q=75)
తెలంగాణలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి అధికారికంగా జాతర ప్రారంభం కానుండగా, లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. ఈసారి జాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.251 కోట్లతో ఆలయాలు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం నలుమూలల నుంచి TGSRTC 4 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య, పారిశుధ్య, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!