
రాజకీయాలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. రన్వేపై టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్లో లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
ఈ విమానంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సాంకేతిక సమస్య కారణంగా ఇండిగో అధికారులు విమానాన్ని రద్దు చేశారు. దీంతో నాయకులు రోడ్డు మార్గాన బయల్దేరగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తామని ఇండిగో అధికారులు హామీ ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!