

డీలిమిటేషన్ బిల్లు మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పులు ఈ బిల్లుకు కొత్త ఊపు తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
డీలిమిటేషన్ అంశంపై గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన డీఎంకే ఇప్పుడు తన వైఖరిని పునఃసమీక్షించే దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు డీఎంకే నాయకత్వంతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజకీయ పరిస్థితులు మారుతున్న వేళ డీలిమిటేషన్ బిల్లుపై అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!