
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. రెండో విడతగా దాదాపు ఇరవై రోజుల తర్వాత రూ.2,650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. మూడో విడతను వచ్చే నెల నెలాఖరులోపు పూర్తిచేసి, మొత్తం మూడు విడతల ద్వారా సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!