
క్రీడలు

ఫుడ్ డెలివరీ యాప్లు వినియోగదారులకు మరోసారి షాక్ ఇస్తున్నాయి. జొమాటో తర్వాత స్విగ్గీ కూడా ప్లాట్ఫామ్ ఫీజును ₹14.99 నుంచి ₹17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. దీంతో ప్రతి ఆర్డర్పై వినియోగదారులు అదనంగా ₹2.59 చెల్లించాల్సి వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం, ఇంధన సంబంధిత సమస్యలు పెరగడం వల్ల ఖర్చులు అధికమవుతున్నాయని, వాటిని సమతుల్యం చేసేందుకు ఈ ఫీజు పెంపు చేపట్టినట్లు సమాచారం. 2023 ఏప్రిల్లో కేవలం ₹2తో ప్రారంభమైన ఈ ప్లాట్ఫామ్ ఫీజు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒక్కో వినియోగదారునికి ఇది చిన్న మొత్తం అయినప్పటికీ, రోజుకు లక్షల ఆర్డర్లు ఉండటంతో కంపెనీకి ఇది భారీ ఆదాయం తీసుకురానుంది. అయితే, డిస్కౌంట్ యుగం ముగిసిందని, కంపెనీలు లాభాల దశలోకి అడుగుపెడుతున్నాయని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!