
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల – బత్తలూరు మధ్య నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ కు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!