

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా కొనసాగుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశముందని తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు కలిగిన వారికి 3 నుంచి 5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తీసుకున్న వారికి 2 నుంచి 3 గంటల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చని, అందువల్ల భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
ఇక నిన్న మహాశివరాత్రి సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. మొత్తం 80,502 మంది శ్రీవారి దర్శనం చేసుకోగా, 24,608 మంది తలనీలాల మొక్కులు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!