

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బ్యాచ్ను ఉద్దేశిస్తూ, “మంది పెళ్లిళ్ల వద్ద మంగళహారతులు పట్టే వాళ్లలా వ్యవహరిస్తున్నారు” అంటూ విమర్శించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలహీనపరుస్తారు అని ప్రశ్నించారు. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ విజయాలు సాధించినా, తెలంగాణలో మాత్రం ఇంకా అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ గెలుపుపై ఇక్కడ సంబరాలు చేసుకోవడం కంటే, స్థానికంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇంకా ఎంతకాలం ఇతరుల విజయాల్లో మాత్రమే సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించిన రాజా సింగ్, నేతలు తమ బాధ్యతలను గుర్తించాలని అన్నారు. రాంచందర్ రావుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొందరు నేతలు ఈగోలను పక్కన పెట్టాలని, బెంగాల్ విజయంలో కార్యకర్తల సంకల్పం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!