
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరా, ఉద్యాన ఉత్పత్తులు, మార్కెట్ పరిస్థితులపై సమగ్రంగా అంచనా వేసేందుకు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో సరఫరాలు, ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఇక పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన వస్తువుల సరఫరా, ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!