

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జెట్ ఇంధన (ATF) ధరలు భారీగా పెరగడంతో, ఎయిర్ ఇండియా తన విమాన టికెట్లపై 'ఫ్యూయెల్ సర్ ఛార్జ్'ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సర్ ఛార్జ్ మార్పు ఈ నెల 12 నుండి అమలులోకి రానుంది. ఈ పెంపు ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రెండింటికి వర్తిస్తుంది.
సర్ ఛార్జ్ పెంపును మూడు దశల్లో అమలు చేయనున్నారు. 1వ దశ (మార్చి 12 నుండి) దేశీయ విమానాలు మరియు సార్క్ (SAARC) దేశాల టికెట్లపై ₹399 చార్జ్ విధించబడుతుంది. పశ్చిమాసియా మార్గాల్లో $10 కొత్త సర్ ఛార్జ్, ఆగ్నేయాసియా (Southeast Asia) మార్గాల్లో $40 నుండి $60కి, ఆఫ్రికా (Africa) మార్గాల్లో $60 నుండి $90కి పెంపు చేయబడుతుంది. 2వ దశ (మార్చి 18 నుండి) యూరప్ $100 నుండి $125కి, అమెరికా & ఆస్ట్రేలియా $150 నుండి $200కి పెరుగుతాయి. 3వ దశలో హాంగ్కాంగ్, జపాన్, దక్షిణ కొరియా మార్గాల్లో వడ్డింపు వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
ముఖ్యంగా, ఈ నెల 12క్రితం బుక్ చేసిన టికెట్లపై కొత్త సర్ ఛార్జ్ వర్తించదు, అయితే ప్రయాణ తేదీ లేదా రూట్ మార్చితే కొత్త ఛార్జ్ విధించబడుతుంది. కంపెనీ తెలిపినట్లే, విమాన నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40% భాగం ఇంధనానికే వెచ్చించవలసి వస్తుంది. ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనిసరి అవుతుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!