

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని నటి రాశీ ఖన్నా తెలిపింది. ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’లా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆమె పేర్కొంది. పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయాలన్న తన కల ఈ చిత్రంతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా కథానాయికగా నటించింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ కోసం కొన్నిసార్లు పగలు–రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టుల్లో కూడా పని చేశానని రాశీ ఖన్నా వెల్లడించింది. ఈ చిత్రంలో తాను శ్లోక అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని చెప్పింది. కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందిందని, ఇందులో ప్రతి పాత్రకూ మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపింది. అలాగే ఈ సినిమాలో తనకు ఒక మంచి మాస్ పాట కూడా ఉందని వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!