

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన షూటింగ్కు సంబంధించిన విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ఇప్పుడు ‘ఫౌజీ’ విషయంలో మాత్రం ప్రభాస్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విషయంలో నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇరుముడి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ షూటింగ్ సమయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సెట్స్లోనే ఉంటారని చెప్పారు.
అంతేకాదు, తాను సన్నివేశాల్లో పాల్గొనని రోజుల్లో కూడా సెట్స్కు వచ్చి మానిటర్ దగ్గర కూర్చొని చిత్రీకరణను పరిశీలిస్తున్నారని తెలిపారు. చిన్న విషయంలోనూ తేడా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇరుముడి కార్యక్రమం గురించి చెప్పినప్పుడు కూడా ప్రభాస్ ఎంతో ఆసక్తిగా స్పందించారని మైత్రి రవి వెల్లడించారు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఫౌజీ’ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రెండు స్టిల్స్ మాత్రమే విడుదల కాగా, డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ స్వయంగా ఔట్పుట్పై దృష్టి పెట్టడంతో సినిమా అనుకున్న సమయానికి వస్తుందనే నమ్మకం పెరుగుతోంది. దీనితో ‘ఫౌజీ’పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!