
జనరల్

ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 17వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆయనను వెంటనే రక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
ఈ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించి, అవసరమైతే బలవంతంగానైనా వైద్య చికిత్స, ఆహారం అందించాలని కోరారు. బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, కేంద్రం తరఫున ఎలాంటి ప్రతినిధి హాజరుకాకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!