

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న భారీ ప్రాజెక్ట్లో ఆమెను హీరోయిన్గా తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ఆమెకు సుమారు రూ.12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పరిణామాల తర్వాత ఆమె సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్ జెయింట్ బ్యానర్ నిర్మాణం కావడంతో కూడా ఆమె వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.
రజనీకాంత్, కమల్ హాసన్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష ఈ సినిమాలో ఉంటారా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!