

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ ఇటీవల ముంబై వేదికగా విడుదలై అన్ని భాషల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ ట్రైలర్పై స్పందించి చిత్రబృందాన్ని అభినందించారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టులో “పెద్ది ట్రైలర్ ఫైర్” అంటూ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, అలాగే మొత్తం టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. గతంలో ‘జంజీర్’ చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటించిన ప్రియాంక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!