
రివ్యూలు

సినిమా రిలీజ్లకు సంబంధించిన పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ రెండు నెలల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!