

నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్ల వెనుక నలుగురు వ్యక్తులు వ్యవహారాలను నడిపిస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదని, రేపు వారి సినిమాలకూ ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి వరకు సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.
అనేక థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్ లీజ్లో ఉన్నాయని, నిర్మాతలు లీజ్ ఓనర్లకు ఎందుకు డబ్బులు చెల్లించాలనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. సబ్ కమిటీలో 21 మంది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. టికెట్ రేట్ల పెంపు లేదా తగ్గింపు ప్రభుత్వ పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. సునీల్ నారంగ్కు మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారు భాగస్వాములుగా ఉన్నారని, అందరూ ఈ విషయంపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!