

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. లక్కీ భాస్కర్ విజయంతో మంచి ఫామ్లో ఉన్న వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేయడం వల్ల అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.
ఇటీవల కరుప్పు సినిమాతో విజయాన్ని అందుకున్న సూర్య అదే జోష్ను కొనసాగించాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెలవుల సీజన్ను దృష్టిలో పెట్టుకుని విడుదలను ప్లాన్ చేయడంతో పాటు కంటెంట్ బలంగా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!