

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో వేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్లో భాగంగా చారిత్రాత్మక కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్, హీరోయిన్ తృప్తి డిమ్రి మధ్య వచ్చే ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కుతున్నట్లు సమాచారం. కథకు అనుగుణంగా కాలేజీ ప్రాంగణాన్ని ప్రత్యేక సెట్గా మలచిన చిత్ర బృందం రాత్రి వేళల్లో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున షూటింగ్ జరుపుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ను పవర్ఫుల్ పాత్రలో చూపించనున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!