

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సతీ లీలావతి చిత్ర ట్రైలర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఘనంగా విడుదల చేశారు. నాగమోహన్ నిర్మాణంలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ట్రైలర్ను విడుదల చేసిన రామ్ చరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రానికి తమ కష్టం, ప్రేమ అన్నీ తెరపై కనిపిస్తాయని, షూటింగ్ సమయంలో తనకు టీమ్ పూర్తి సహకారం అందించిందని వెల్లడించారు.
దేవ్ మోహన్ మాట్లాడుతూ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. తన పాత్ర కొత్తగా, విభిన్నంగా ఉంటుందని తెలిపారు. దర్శకుడు తాతినేని సత్య, నిర్మాత నాగమోహన్ కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర బృందంలోని పలువురు సభ్యులు తమ అనుభవాలను పంచుకుంటూ, ప్రేక్షకులు తప్పకుండా సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు. మంచి కథ, బలమైన నటీనటులతో ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!