

దర్శకుడు నీరజ్ పాండే, హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సంగీత దిగ్గజం ఆర్.డి. బర్మన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. అయితే చిత్రబృందం దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ప్రతిష్టాత్మక బయోపిక్లో ఆర్.డి. బర్మన్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించనున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే నిర్మాణ సంస్థతో పాటు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్తో పాటు భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!