

సోషల్ మీడియాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద బికినీ వీడియోపై పూర్తి స్పష్టత వచ్చింది. స్విమ్మింగ్ పూల్ వద్ద వేరొకరు చేసిన బోల్డ్ ఫోటోషూట్ వీడియోలను ఏఐ డీప్ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేసి, రుక్మిణి ముఖాన్ని అతికించి నెట్టింట ప్రచారం చేసినట్లు బయటపడింది. ఈ వీడియోలపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో గందరగోళం నెలకొనడంతో రుక్మిణి వసంత్ స్వయంగా స్పందిస్తూ అవి పూర్తిగా నకిలీ కంటెంట్ అని వెల్లడించారు. తనకు ఈ వీడియోలతో ఎలాంటి సంబంధం లేదని, ఇవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రుక్మిణి, ఇలాంటి నకిలీ కంటెంట్ సృష్టించడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. ఈ వీడియోలను సృష్టించిన వారిపై, వాటిని సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే తన లీగల్ టీమ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఇలాంటి డీప్ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. రుక్మిణి తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!