

మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మిరపకాయ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. నాగబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అలీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

2011 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ‘మిరపకాయ్’ అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఇటీవల టాలీవుడ్లో పలు హిట్ సినిమాలు రీ-రిలీజ్ అవుతూ మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ‘మిరపకాయ్’ను కూడా మరోసారి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రీ-రిలీజ్లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!