

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కలిసి కారులో ప్రయాణిస్తూ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో చేసిన యాక్షన్ సీన్ల గురించి చరణ్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇసుకలో, ఎండలో షూటింగ్ చేయడం కష్టంగా అనిపించలేదా అని అడగగా.. తాను ఆ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని రామ్ చరణ్ తెలిపారు. ఇష్టంగా చేసే పని ఎప్పుడూ అలసట కలిగించదని అన్నారు. అయితే కుస్తీ సన్నివేశాల్లో చేయికి గాయమై తన కూతురిని కూడా ఎత్తుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. సినిమాలో నిజమైన పహిల్వాన్లను తీసుకురావడంతో ఫైట్స్ చాలా రియలిస్టిక్గా జరిగాయని, వారి స్పోర్ట్స్మన్ స్పిరిట్ తనను ఆకట్టుకుందని చెప్పారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!