

ఇండియన్ సినిమా లెజెండ్స్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్ మరోసారి కలిసి నటించబోతున్నారు. 47 ఏళ్ల తర్వాత ఈ అరుదైన కాంబినేషన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది రెడ్ జెయింట్ మూవీస్. ‘కెహెచ్ఎక్స్ఆర్కే’ వర్కింగ్ టైటిల్తో ఈ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆయన ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్లో చూపించబోతుండటం విశేషం. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో, చిరస్మరణీయమైన కథతో ఈ సినిమాను నిర్మించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
70వ దశకంలో కలిసి నటించిన ఈ ఇద్దరు మహానటులు తర్వాత తమదైన మార్గంలో ప్రయాణిస్తూ భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇప్పుడు మళ్లీ ఒకే చిత్రంలో కనిపించడం అభిమానులకు పండుగలా మారింది. ఈ చిత్రం ఇండియన్ సినిమాకు చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది..jpeg)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!