

ఇంకా నాలుగు రోజుల్లో జరగబోతున్న ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ కోసం అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ వేడుకను రాజమౌళి తన శైలిలోనే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్తో, ఏ దూరంలో ఉన్నా స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సారి రివీల్ ప్రెజెంటేషన్ సినిమాకు తగ్గట్టుగానే అద్భుతంగా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఇటీవల జరిగిన బాంబు దాడి ఘటన తర్వాత, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. దాంతో ఈవెంట్ సమయంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉంది. ఇది అభిమానులకు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తున్నారు.
ఇక ఈ వేడుకలోనే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు 2027 ద్వితీయార్థంలో కాకుండా, ఇంతకంటే ముందుగానే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మనసులో ఖచ్చితమైన డేట్ ఫిక్స్ అయినప్పటికీ, దాన్ని ఈ వేదికపైనే ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
ఇటీవల శ్రుతిహాసన్ పాడిన “సంచారి” సాంగ్ యూట్యూబ్లో హఠాత్తుగా రిలీజ్ అయి కొద్ది సేపట్లోనే తీసేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. “గ్లోబ్ ట్రాట్టర్” అనే వర్కింగ్ టైటిల్తో సాంగ్ రిలీజ్ చేసి మళ్లీ డిలీట్ చేయడం వెనకా కూడా ఒక ప్రత్యేక ప్లాన్ ఉందట.
జక్కన్న ఈ సారి కూడా అనూహ్యమైన సర్ప్రైజ్లు చాలా ప్లాన్ చేస్తున్నారట. సాంప్రదాయ ప్రమోషన్ కాకుండా, ప్రతి అనౌన్స్మెంట్ కొత్తగా, క్రియేటివ్గా ఉండేలా రాజమౌళి ఆలోచిస్తున్నారట. విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ లుక్, తదుపరి సాంగ్ రిలీజ్ కూడా ఊహించని రీతిలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
చివరగా, నవంబర్ 15 న “మేము వస్తున్నాం” అంటూ రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఆశ్చర్యం అవసరం లేదని టాక్ వినిపిస్తోంది. “ఆర్ఆర్ఆర్” సమయంలోనూ ఇలాగే ప్రకటించి, కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ సారి మాత్రం అభిమానుల కోరిక ఏకైకంగా ఉంది.
“ఎస్ఎస్ఎంబి 29” ఎటువంటి అడ్డంకులు లేకుండా, అనుకున్న సమయానికే థియేటర్లలోకి రావాలి!










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!