

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ప్రశంసిస్తూ, ఆయన కేవలం గొప్ప దర్శకుడే కాకుండా అద్భుత నటుడని పేర్కొన్నారు. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళితో పనిచేసిన అనుభవాన్ని ఆయన హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతి సన్నివేశాన్ని వివరించేటప్పుడు రాజమౌళి స్వయంగా పాత్రలో లీనమై భావోద్వేగాలను చూపిస్తూ నటీనటులకు స్పష్టత ఇస్తారని చెప్పారు.
రాజమౌళి కృషి, క్రమశిక్షణ గురించి కూడా పృథ్వీరాజ్ విశేషంగా ప్రస్తావించారు. ఉదయం షూటింగ్ ప్రారంభానికి గంటల ముందే సెట్స్కు చేరుకుని రిహార్సల్స్ పూర్తి చేస్తారని తెలిపారు. ఒక్కో సన్నివేశం కోసం 90 టేక్లకు పైగా తీసే సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. మొదట ఆయన విజన్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ, ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు ఆశ్చర్యపోయేవాడినని చెప్పారు. ఆయనతో పనిచేయడం వల్ల తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఎదిగానని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!