
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ హైదరాబాద్లో భారీగా లాంచ్ అయింది. ఈ వేడుకలో రాజమౌళి ఒక కీలక ప్రకటన చేస్తూ, ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నామని తెలిపారు—అది Premium Large-Scale Format for IMAX.
సాధారణంగా సినిమాలు సినిమాస్కోప్ ఫార్మాట్లో షూట్ చేసి, తర్వాత IMAX కోసం కన్వర్ట్ చేస్తారని రాజమౌళి చెప్పారు. బాహుబలి, RRR కూడా ఇదే విధంగా నిర్మించబడ్డాయి. అయితే, ‘వారణాసి’ మాత్రం పూర్తిగా ఫుల్-స్క్రీన్ IMAX ఫార్మాట్లోనే షూట్ అవుతుందని ఆయన వెల్లడించారు.
“తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాం—Premium Large-Scale IMAX. సాధారణ కెమెరాతో షూట్ చేసి తర్వాత IMAXగా మార్చడం కాదు… వారణాసి మొదటి నుంచే IMAX ఫుల్-స్క్రీన్ ఫార్మాట్లో ఉంటుంది,” అని రాజమౌళి వివరించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో టెక్నాలజీలకు శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు కూడా కొత్త టెక్నాలజీని తీసుకొస్తుండటం విశేషమని రాజమౌళి అన్నారు.
ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ప్రేక్షకులు IMAX థియేటర్లలో ఫుల్-స్క్రీన్ అనుభవాన్ని పొందబోతున్నారు.
Durga Arts మరియు Showing Business నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!