
జనరల్

ప్రభాస్తో దర్శకుడు ఓం రౌత్ మరో సినిమా చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ను సంప్రదించగా, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్లో మరో సినిమా ఖరారైందనే వార్తలను టీమ్ ఖండించింది. దీంతో ఈ ప్రాజెక్ట్పై వస్తున్న ప్రచారానికి తెరపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!