
జనరల్

గురు నానక్ డెయిరీ & స్వీట్స్పై తీసుకున్న చర్యను మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే సమర్థించారు. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు ఆశ్చర్యం కలిగించాయని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల పూర్తి లిఖిత ప్రతిని ఇంకా అందుకోలేదని, అది అందిన తర్వాత నిశితంగా పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామని స్పష్టం చేశారు.
ఈ కేసు స్వీట్లు తిని పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటనకు సంబంధించినదని ముంఢే తెలిపారు. ఆహార భద్రతా పరీక్షల్లో స్వీట్ల నమూనాలు ‘అసురక్షితం’గా తేలినందునే దుకాణంపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. తమ చర్యపై ఎఫ్డీఏ వెనక్కి తగ్గబోదని, హైకోర్టు పూర్తి ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ముండే వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!