

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డే, వరుస ఫ్లాప్లతో కొంతకాలం వెనుకబడి పోయింది. అయితే ఇప్పుడు ఈ బుట్టబొమ్మ మళ్లీ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో రెండు మూడు ప్రాజెక్టులు చేసుకుంటున్న పూజా, ఇప్పుడు మళ్లీ తెలుగులో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోందని సమాచారం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమాకు పూజా పేరు చర్చల్లో ఉంది. దీపికా పదుకునే ప్రధాన హీరోయిన్గా ఇప్పటికే అనౌన్స్ చేయగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్లో పూజా హెగ్డేకి కీలక పాత్ర ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో, నాని నెక్స్ట్ సినిమాకీ ఆమెను సైన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చూస్తుంటే త్వరలోనే పూజా హెగ్డే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో మరోసారి ఫుల్ బిజీగా మారనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!