

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా విడుదల జరగాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఫైనల్ కంటెంట్ను ముందుగానే పంపించేలా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం.
గతంలో కొన్ని భారీ చిత్రాలు ఓవర్సీస్ కంటెంట్ డెలివరీ విషయంలో సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో ‘పెద్ది’ టీమ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కారణంగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఇటీవల భోపాల్లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్కు కూడా హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలను ఎలాంటి హడావిడి లేకుండా గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!