
రాజకీయాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్కు సంబంధించిన టీజ్ విడుదలైంది. “దమ్మునోడు దాటొచ్చు” అనే పవర్ఫుల్ డైలాగ్తో వచ్చిన ఈ టీజ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. విడుదలైన వెంటనే ఇది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తూ ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా, రాశి ఖన్నా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19 న ఘనంగా విడుదల కానుంది. ట్రైలర్ త్వరలో విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!