

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జేసన్ సంజయ్ తెరకెక్కిస్తున్నారు. భారీ దోపిడీ, అడ్వెంచరస్ ట్రెజర్ హంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్.. పక్కా ప్లాన్తో సాగే హైస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో సందీప్ కిషన్ సరికొత్త స్టైలిష్, రగ్గడ్ లుక్లో కనిపిస్తూ పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా గన్ పట్టుకుని చేజింగ్ సన్నివేశాల్లో యాక్షన్ ఎనర్జీని చూపించారు. రాజు సుందరం, సంపత్ రాజ్ పాత్రలు కూడా కథలో కీలకంగా కనిపిస్తున్నాయి.
కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. దర్శకుడిగా జేసన్ సంజయ్కు ఇది తొలి చిత్రం కావడంతో ‘సిగ్మా’పై ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. నియో-నోయిర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి కథను చూపించబోతోందనే ఆసక్తి ట్రైలర్తో మరింత పెరిగింది. థియేటర్లలో ప్రేక్షకుల స్పందన, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమా కమర్షియల్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. ‘సిగ్మా’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!