

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో అక్టోబర్ మొదటి వారంలో తిరిగి షూటింగ్లో పాల్గొననున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ లేని ఇతర కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు ప్రశాంత్ నీల్ కొనసాగిస్తున్నారు. హీరోకు గాయం కారణంగా షూటింగ్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ముందుగా ప్రకటించిన 2027 జూన్ విడుదల లక్ష్యాన్ని మార్చకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!