
యంగ్ హీరో రోషన్ కనకాల హీరోగా నటించిన రెండవ చిత్రం మోగ్లీ 2025 డిసెంబర్ 13 న విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్–కృతి ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ గురించి రోషన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోగ్లీ ప్యూర్, ఇన్నోసెంట్ లవ్ స్టోరీగా రూపొందిందని, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉండే రేసీ స్క్రీన్ప్లేతో ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వదని చెప్పారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ కథలో మోగ్లీ క్యారెక్టర్ ప్రేమ కోసం ఏదైనా చేసే వ్యక్తి అని, ప్రేక్షకులు అతనితో కనెక్ట్ అవుతారని రోషన్ విశ్వాసం వ్యక్తం చేశారు. షూటింగ్లో 60% ఫారెస్ట్లోనే జరగడం చాలెంజింగ్ అయినప్పటికీ, తాను పూర్తి ఆనందంతో చేశానని చెప్పారు. బండి సరోజ్ కుమార్, హర్ష, హీరోయిన్ సాక్షి నటన సినిమాకు ప్రత్యేకతనిచ్చిందని, కాలభైరవ సంగీతం సినిమా స్థాయిని మరింతగా పెంచిందని తెలిపారు.
తన తల్లిదండ్రులు రాజీవ్ కనకాల, సుమ ఇచ్చిన సూచనలు ఈ సినిమాలో ఎంతో ఉపయోగపడ్డాయని రోషన్ చెప్పారు. సెలబ్రిటీ ప్రీమియర్లో శ్రీ విష్ణు, సాయి రాజేష్, SKN వంటి ప్రముఖులందరూ సినిమాను ప్రశంసించడంతో టీమ్కి భారీ కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు. ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయని చెప్పిన రోషన్, ప్రీ-ఇంటర్వెల్ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ తనకు గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిందన్నారు. మొదటి సినిమాకు, ఈ సినిమాకూ టీజీ విశ్వ ప్రసాద్ అందించిన సపోర్ట్కు కృతజ్ఞతలు తెలిపిన రోషన్, త్వరలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, మరో రొమాంటిక్ కామెడీ చిత్రాలను ప్రకటిస్తామని వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!